News

గుండెపోటుతో టీడీపీ నేత మృతి


కడప/ రామాపురం చిట్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు పప్పిరెడ్డి రఘురామిరెడ్డి (45) శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు టీడీపీ నాయకుడు వై. శేఖర్‌, బంధువులు తెలిపారు. పార్టీలో చురుగ్గా ఉంటూ ఎంతో పని చేశారన్నారు. రఘురామిరెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న వయస్సులో గుండెపోటుతో మృతి చెందడం కుటుంబానికి అండలేకపోవడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. రఘురామిరెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, పరిస్థితిని రాయచోటి ఇన్‌చార్జి రమేష్‌రెడ్డి దృష్టికి తీసుకుపోయి అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రఘురామిరెడ్డి మృతదేహానికి పలువురు టీడీపీ, వైసీపీ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు.